కడప

రాష్ట్ర స్థాయి పోటీలకు ఆస్మా ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 29: విశాఖపట్టణంలోని రామక్రిష్ణమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోదరి నివేదితపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మాసాపేట జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని పాలగిరి ఆస్మా ఎంపికైంది. అక్టోబర్ నెల 28వ తేదీ నుండి విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరుకావాల్సిందిగా పాలగిరి ఆస్మాకు ఆహ్వానం అందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఇదే పాఠశాల నుంచి గయాజ్, మహమ్మద్, షాహీనాభాను, అబ్దుల్‌అజిస్‌లు ప్రోత్సాహక బహుమతులు పొందినట్లు తెలిపారు. వీరికి రామక్రిష్ణమిసన్ వారిచే రూపొందించిన వివేకానంద జీవితచరిత్ర ఉపన్యాసాలు పుస్తకాలను పంపిణీ చేవారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుబ్రమణ్యం, వెంకట్రామయ్య, డాక్టర్ రెడ్డన్న, వెంకటరమణ, లక్ష్మినారాయణ, మురళి, కారంశెట్టి గిరి, నరసింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.