కడప

ఏం నెరవేర్చారని జన చైతన్యయాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,నవంబర్ 4: టిడిపి అధికారం చేపట్టి మూడుసంవత్సరాలైనా ఒక్క హామీ కూడా నెరవేరకుండా జనచైతన్యయాత్రలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్ కె.సురేష్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన వారు ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఏమి సాధించారని వారు ప్రశ్నించారు. పక్కా ఇళ్లు ఒక్కటి కూడా నిర్మించలేదని సంక్షేమపథకాలు ప్రజలకు అందడం లేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టిడిపి నాయకులు ఏకమైనా ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించుకోలేరని అది ఎప్పటికీ వైసిపి ఖాతాలోని ఉంటుందన్నారు. కమలాపురం, ప్రొద్దుటూరులో నాయకులు ఏకమైనా ఎమ్మెల్యేగా టిడిపిని గెలిపించుకోలేకపోయారన్నారు. ఇప్పటికైనా జమ్మలమడుగు ఎమ్మెల్యే రాజీనామాచేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. పేదలకు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబునాయుడుకు త్వరలో బుద్దిచెప్పే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రధానంగా పేద,బడుగు, బలహీనవర్గాల ప్రజలంతా వైకాపా వైపే ఉన్నారని, 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు సునీల్, షఫి తదితరులు పాల్గొన్నారు.