కడప

దర్గాను ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, ఏప్రిల్ 19: మండల పరిధిలోని గోరీస్వామి దర్గాను ట్రాక్టర్ ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందినట్లు ఎఎస్‌ఐ నాగన్న తెలిపారు. వివరాలలోకి వెళితే మంగళవారం రాజుపాళెం గ్రామానికి చెందిన ఓబులేసు (40) ట్రాక్టర్‌లో మూడిళ్లపల్లె గ్రామంలోని క్రషర్ మిషన్ నుంచి కంకర తీసుకెళ్తుండగా కర్నూలు-కడప హైవే వద్దనున్న గోరీస్వామి దర్గాను ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మార్గమద్యంలో ఓబులేస్ మృతిచెందినట్లు ఎఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమెదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ పేర్కొన్నారు.