కడప
మైలవరం నుండి నీటి విడుదల నిలిపివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 April 2018
మైలవరం, ఏప్రిల్ 22: మైలవరం జలాశయం నుండి పెన్నానదికి చేపట్టిన నీటి విడుదలను ఆదివారం నిలిపివేసినట్లు జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సుధాకర్ తెలిపారు. పెన్నానదిలో భూగర్భజలాలను పెంపొందించేందుకు మైలవరం జలాశయ ప్రధాన గేట్ల ద్వారా 1టియంసి నీటి విడుదలకు జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు అనుమతి ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీ నుండి పెన్నానదికి నీటి విడుల చేపట్టారు. ఆదివారం నాటికి 1టియంసి నీటి విడుదల పూర్తి కావడంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 4.70టియంసిల నీటినిల్వ ఉన్నట్లు జలాశయ అధికారులు తెలిపారు.