కడప

పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 21: 2019 ఎన్నికలలో పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తామని సీమకు పట్టులాంటిది పట్టిసీమ అని 35 సంవత్సరాల వైఎస్ చరిత్రను 38 ఓట్లతో తిరగరాశామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. సోమవారం పులివెందులలో మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాల వైఎస్‌ఆర్ కుటుంబం జిల్లాలో ఓటమి లేకుండా గెలవడం జరిగిందని, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ వివేకానందరెడ్డిని 38 ఓట్లతో ఓడించి పులివెందుల వైఎస్‌ఆర్ చరిత్రను తిరగరాయడం జరిగిందన్నారు. పట్టిసీమ నుంచి కడప జిల్లాకు కృష్ణా జలాలను తీసుకురావడం జరిగిందన్నారు. జగన్ ఒక మనీ రాక్షసుడు అని అతనికి డబ్బుపై వ్యామోహం తప్ప ప్రజా సంక్షేమంపై ఎటువంటి వ్యామోహం లేదన్నారు. ప్రజల సమస్యలు అడిగితే ముఖ్యమంత్రి అయ్యాక చూస్తాననడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తీర్చలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలుగుతారో చెప్పాలన్నారు. మంత్రి పదవిపై తనకు వ్యామోహం లేదు, ప్రజా సంక్షేమం కోసమో మంత్రి పదవిని తీసుకోవడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలన్నారు.