కడప

త్యాగం చేసేవారు కొందరే పుడతారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడపసిటీ, జూన్ 24: దేశం కోసం, ప్రజల కోసం త్యాగం చేసేవారు కొందరే పుడతారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆదివారం అన్నారు. కడప నగరంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఉక్కు దీక్షను సందర్శించేందుకు వచ్చిన ఆయన దీక్షకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. గాంధీ మహాత్ముడు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ లాంటి మహనీయులు ప్రజల కోసమే పుడతారన్నారు. ప్రజల కోసం, యువతకు విద్య, ఉపాధి కోసం రమేష్‌నాయుడు చేస్తున్న దీక్ష అభినందనీయమన్నారు. రమేష్‌నాయుడు రాజ్యసభలో సైతం ఒక్క క్షణం కూడా వృధా చేయడని ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటారన్నారు. ప్రజలందరి మద్దతే వారికి బలమని తెలిపారు. సీఎం రమేష్ దీక్షపై వారి కుటుంబం సైతం ఆందోళన చెందుతోందని, ప్రజల మద్దతే వారికి ఓదార్పు అన్నారు. ఆయన దీక్ష సఫలం కావాలని కోరారు. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన హామీ రాబట్టుకునేందుకు తపనపడటం అభినందనీయమన్నారు. నేను కాంగ్రెస్ వాడిని అయినా ఇది నా బాధ్యతగా ఉక్కు ఉద్యమానికి వచ్చానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కేవలం ఆయన కృషి వల్లే ఎడారి లాంటి మా అనంతపురం జిల్లాకు 45 టీఎంసీల నీళ్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆనాడే మూడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకుంటే పోలవరాన్ని మరిచిపోవాల్సి ఉండేదన్నారు. కేంద్రం ఆంధ్రులపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ రోజు కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా ముందుకు పోవాలని సూచించారు. తెలుగువారికి అండగా ఉండే పార్టీకి మీరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉక్కు కోసం యావత్తు తెలుగు జాతి సహకారం అందించి ఈ దీక్ష ద్వారా ఉక్కు కర్మాగారాన్ని సాధించాలని కోరారు.