కడప

నవరత్నాలతోనే వైఎస్ ఆశయ సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లిమర్రి,సెప్టెంబర్ 24: నవరత్నాలతోనే వైఎస్ ఆశయాలు నెరవేరుతాయని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలో కావాలి జగన్-రావాలి జగన్ అనే కార్యక్రమాన్ని గ్రామంలో అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం మాజీ సర్పంచ్ పాలగిరి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 30కుటుంబాలు వారు ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కడప మేయర్ కె.సురేష్‌బాబు, కమలాపురం పార్టీ సమన్వయకర్త డి.మల్లికార్జునరెడ్డి, మండల వైకాపా కన్వీనర్ ఎం.చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపాలోకి వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజలకు ఏమాత్రం న్యాయం చేకూరలేదని అందుకే టీడీపీ నుండి వైకాపాలో చేరుతున్నారన్నారు. వైకాపా ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఈ నవరత్నాలతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుస్తామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలకు మేలు జరగాల్సిన ఏ ఒక్క సంక్షేమపథకం కూడా నిజమైన లబ్దిదారులకు చేరకుండా కేవలం టీడీపీ నేతలకే చెందుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌ను సిఎంను చేస్తే ఏపీ ప్రజానీకమంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకే చెందడంలో కీలక పాత్ర ఉంటుందన్నారు.