కడప

జగన్ పాలనలో రైతే రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,సెప్టెంబర్ 24: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన పాలనలో రైతే రాజు అవుతాడని సోమవారం కావాలి జగన్ -రావాలి జగన్ కార్యక్రమంలో మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్‌బాషాలు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలకు ఎన్నోసంక్షేమపథకాలు ప్రవేశపెట్టడమే గాక రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చారని అలాంటి రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే సాధ్యవౌతుందన్నారు. నగరంలోని రామాంజనేయపురం 3వ డివిజన్‌లో నిర్వహించిన ఈకార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను , జరుగుతున్న అవినీతిని ప్రజలకు వారు వివరించారు. జగన్ పాలనలో ప్రజలు ఆర్థిక ప్రగతిని సాధించి రాష్ట్రం పురోగతి సాధిస్తుందన్నారు. రైతులకోసం ఎన్నో సంక్షేమ పథకాలు వైసీపీ సిద్ధం చేసిందన్నారు. చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేదని కేవలం తప్పుడు హామీలతో అధికారాన్ని కైవసం చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు. జిల్లాలో తీవ్ర కరువు చోటుచేసుకుని రైతులు,ప్రజలు,గ్రామీణ ప్రజానీకం అతలాకుతలవౌతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. టీడీపీ నేతలు స్వార్థ ప్రయోజనాలకోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారే తప్ప ప్రజలకోసం చేసింది ఏమీలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పి వైసీపీని ఆదరించాలని వారు కోరారు.