కడప

చంద్రబాబు సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, నవంబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష అని శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కుప్పం పంచాయతీలోని కుప్పం, నడింపల్లె, కుప్పం హరిజనవాడ, కుప్పం తండా, చిన్నమోరయ్యగారిపల్లె, కొప్పలవాండ్లపల్లె, కోతలవాండ్లపల్లె, బురుజుపల్లె, కాలనీ, కొండుగారిపల్లె, కొండుగారిపల్లె వడ్డెపల్లె గ్రామాల్లో వారు ఇంటింటికీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా కార్యక్రమంలో మండలంలోని కుప్పం పంచాయతీలో మాత్రం రూ.3,74,55,088 రైతులకు రుణమాఫీ అందిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు రథాలు(ట్రాక్టర్లు), రైతు పొలాలకు సంబంధించి పనిముట్లు కూడా అందించామన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేపడుతున్న చంద్రబాబుకు 2019 ఎన్నికలలో టీడీపీకి ఓట్లు వేసి అదిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటరును వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఈశ్వరరెడ్డితో పాటు మాజీ మండలాధ్యక్షుడు రుగ్మాంధరరెడ్డి, పార్టీ ఉప మండలాధ్యక్షుడు వెంకటమల్లప్పనాయుడు, టీడీపీ మండల నాయకులు కొండారెడ్డి, రమేష్, మాజీ సర్పంచులు జగన్‌మోహన్‌రెడ్డి, సుబ్బరామయ్య, మండల మాజీ ఉపాధ్యక్షుడు నరసింహులు, వెంకటరమణారెడ్డి(బాబు), సుధాకర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, రెడ్డప్పరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, చాన్‌బాష, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.