కడప

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,డిసెంబర్ 10: సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి సోమవారం అన్నారు. నగర శివారులోని సిఎంఆర్ పల్లి హిల్ వ్యాలీలో ఏరియా కో-ఆర్డినేటర్లకు నిర్వహించిన నాయకత్వ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఏపీలోనే అమలవుతున్నాయన్నారు. 2019లో టీడీపీ జిల్లాలోని అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. కో-ఆర్డినేటర్లుగా శిక్షణ పొందుతున్నవారు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ఓటర్లశాతం పెంపొందేలా చూడాలని కోరారు. అత్యధిక స్థానాలు సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నాయకత్వ శిక్షణ శిబిరం నిర్దేశకులు భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అప్పుడే పార్టీ, నాయకులు బలోపేతం అవుతారన్నారు.