కడప

కాంగ్రెస్ నేతల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,డిసెంబర్ 11:ఐదు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం అంచున చేరుకోవడంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద మంగళవారం బాణసంచాపేల్చి అనందాన్ని పంచుకున్నారు. డిసిసి అద్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాలైన మద్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌పార్టీ విజయ ఢంకా మోగించిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా మహాకూటమి రావాల్సివుండగా అక్కడ ప్రజాతీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. నరేంద్రమోదీ పాలనకు శకం ముగిసిందని, ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్కరాష్ట్రంలో బీజేపీ రాకపోవడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్రమోదీ పాలనను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు.