కడప

దమ్ముంటే మోడీ నివాసం వద్ద ధర్నా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదుకూరు, మే 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా అధినేత జగన్‌తోపాటు, ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం ధర్నాలు చేయడం జగన్ మార్క్ కుట్ర రాజకీయాలకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తే ప్రత్యేక హోదా రాదని, జగన్‌కు దమ్మూ, ధైర్యమూ, నీతీ, నిజాయితీ, చిత్తశుద్ధి వుంటే ఢిల్లీలోని ప్రధాని ఇంటి వద్దగానీ, ప్రధానమంత్రి కార్యాలయం వద్దగానీ ధర్నా చే యాలని ఆయన జగన్‌కు సవాల్ విసిరారు. జగన్‌పై నమ్మకం లేకే వైకాపా ఎమ్మెల్యేలు పెద్ద సం ఖ్యలో టిడిపిలో చేరుతున్నారని, దిక్కుతోచక తన పార్టీ ఉనికిని కాపాడుకొనడంలో భా గంగానే ధర్నాలు, నిరాహారదీక్షలంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ హైడ్రామాలాడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. జగన్ ప్రధానమంత్రిని పల్లెత్తుమాట కూడా అనకుండా చంద్రబాబును విమర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హోదా కోసం చంద్రబాబునాయుడు అనేకసార్లు ప్రధానిని కలిశారని, కేంద్రమంత్రులు, ఎంపిలు పార్లమెంట్‌లో అలుపెరగని పోరాటం చేసిన విషయం మరువరాదని ఆ యన గుర్తుచేశారు. కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే శక్తి, సామర్థ్యాలు చంద్రబాబు ఒక్కరి కే వుందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. టిడిపి పట్టణాధ్యక్షుడు బిపి.సుధాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఎపి.రవీంద్రతోపాటు ఆ పార్టీ నాయకులు ఆర్.శ్రీను, కటారు క్రిష్ణ, చెంచురామయ్య, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.