కడప

కడపకు చేరుకున్న గవర్నర్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 27: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు బుధవారం మధ్యాహ్నం 3.40గంటలకు కడప నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు తిరిగి చేరుకున్నారు. మంగళవారం ఇక్కడి నుండి కర్నూలు జిల్లాలోని రుద్రవరంకు వెళ్లిన గవర్నర్ దంపతులు, అక్కడ ఉత్సవ మూర్తిని దర్శించుకుని అనంతరం మంగళవారం రాత్రి అహోబిలంలోని హరిత టూరిజం గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. బుధవారం ఉదయం అహోబిల నరసింహ్మస్వామిని దర్శించుకుని, అక్కడి నుండి బయలుదేరి కడప నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, ట్రైనీ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తదితరులు గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ దంపతులు గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం ఇక్కడి నుండి ఒంటిమిట్టకు బయలుదేరి, అక్కడ కోదండరామస్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి రోడ్డుమార్గం ద్వారా కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి విమానాశ్రయంకు వెళ్లి గురువారం ఉదయం 10.30గంటలకు హైదరాబాద్ వెళ్లిపోతారు.