కడప

తెలంగాణలో ప్రాజెక్టులతో రాష్ట్రం ఎడారే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, మే 17:తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడారిగా మారే ప్రమాదం ఉందని వైకాపా జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నందలూరు బస్టాండ్‌లో వైకాపా మండల అధ్యక్షులు గోపీరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి కర్నూల్‌లో చేపట్టిన జల దీక్షకు మద్దతుగా మండల కేంద్రాలలో వైకాపా నాయకులు దీక్షలు చేపట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్యాయాన్ని ప్రశ్నించకుండా సిఎం చంద్రబాబునాయుడు ఎందుకు వౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. స్వార్థం కోసం ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలతో కెసిఆర్, బాబు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. బుధవారం కర్నూల్‌లో జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తాను వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నడివీధి సుధాకర్, గడికోట సుబ్బారెడ్డి, సౌమిత్రి, గీతాల నరసింహరెడ్డి, దినేష్, సుభాన్, ఎం.సుధాకర్, పల్లె శివశంకర్‌రెడ్డి, షావలీ, జగదీశ్వరరెడ్డి, గోపాల్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.