కడప

ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,జూలై 10: రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేద్దామని టిటిడి పాలక మండలి సభ్యుడు పుట్టాసుధాకర్ యాదవ్, తెదెపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు అన్నారు. కోట్లూరు మాజీ సర్పంచ్ గంగిరెడ్డి అంకిరెడ్డి ఏర్పాటుచేసిన రైతుల ట్రాక్టర్ల విడిభాగాల సామాగ్రి షాపును ఆదివారం వారు ప్రారంభించారు. అనంతరం వారు విలేకర్లతోమాట్లాడుతూ రూ.16వేల కోట్ల లోటుబడ్జెట్‌లో ఉండి కూడా రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫిలను చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి కుంభకోణాలలో ఎన్నో కేసులలో ప్రధాన నిందితునిగా ఉన్న జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించడం హస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించడం పనిగా పెట్టుకున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం పైసా ఖర్చుచేయకుండా 30వేల ఎకరాల పొలాన్ని రైతుల నుంచి ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్భ్రావృద్దికోసం పాటుపడుతున్న చంద్రబాబునువిమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్న జగన్‌ను ప్రజలే తరిమికొడతారన్నారు. ఏమిచేశారని గడప గడపకు వైకాపా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇళ్ల వద్దకు వచ్చే వైకాపా నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించడం మాని అభివృద్ధి నిరోధకుడుగా మారకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో మైదుకూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ శ్రీరాములు యాదవ్, మార్కెట్‌యార్డు డైరెక్టర్లు బచ్చల శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, టిడిపి మండల మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మిదేవి,చాపాడు మండల అద్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, మాజీ అధ్యక్షుడు రెడ్యం ఆదినారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి, ఉపమండలాధ్యక్షుడు చంద్రఓబులరెడ్డి తదితరులు ఉన్నారు.