జాతీయ వార్తలు

కలకలం రేపుతున్న కేజ్రీవాల్ ట్వీటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పెట్టిన తాజా పోస్టు రాజకీయంగా కలకలం రేపుతోంది. తన మంత్రివర్గ సహచరుడు మనీష్ సిసోదియాకు ఈ ట్వీట్‌ను కేజ్రీవాల్ పంపారు. కొద్దిరోజుల క్రితం సిసోదియా దిల్లీలో ప్రభుత్వ కళాశాల భవనాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ‘సిసోదియా.. నీపైకి మోదీజీ సిబిఐని పంపుతారేమో.. కళాశాల భవనాలను ప్రారంభించే అధికారం నీకు లేదని అంటారెమో..!’ అని ట్వీటు చేశారు. దిల్లీ పాలనావ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఎక్కువవుతోందని, తమ మంత్రివర్గాన్ని ఖాతరు చేయడం లేదని కేజ్రీవాల్ ఇటీవల సందర్భం దొరికినపుడల్లా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన ఇలా ట్వీటు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.