క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, జూన్ 11: బంధువులను చూసేందుకు ఇద్దరు చిన్నారులతో కలసి భార్యాభర్తలు ద్యిచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనటంతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన వాడపల్లి గాంధి (28), అతని భార్య వెంకటేశ్వరమ్మ(23)లు తమ ఇద్దరు పిల్లలు నాలుగేళ్ళ మనీష, మూడేళ్ళ మానసలతో కలసి ద్విచక్ర వాహనంపై సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూసేందుకు వస్తూ ప్రమాదానికి గురయ్యారు. తల్లి తండ్రుల మరణంతో చిన్నపిల్లలు అనాథలుగా మారారు.