జాతీయ వార్తలు

కుష్బూకు కాంగ్రెస్ టిక్కెట్ ‘నో’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: సినీనటి కుష్బూకు ఆశాభంగం తప్పలేదు. చెన్నైలోని మైలాపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావించినా కాంగ్రెస్ అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది. డిఎంకెతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పటికీ తుది జాబితాలోనూ కుష్బూ పేరు లేదు. మైలాపూర్ నుంచి మాజీ డిప్యూటీ మేయర్ త్యాగరాజన్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. టిక్కెట్ దక్కనందున కుష్బూ ఇపుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.