ఆంధ్రప్రదేశ్‌

కళానికేతన్ ఎండీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: 4.14 కోట్ల రూపాయల విలువ చేసే పట్టుచీరలను కొనుగోలు చేసి బకాయి పడ్డ కళానికేతన్ ఎండి వేములూరి లీలాకుమార్‌ను ధర్మవరం పోలీసులు కర్నూలులో గురువారం అరెస్టు చేశారు. ధర్మవరం కోర్టులో ఆయనను హాజరుపరచగా 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. 4.14 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించనందున లీలాకుమార్‌పై పట్టుచీరల వ్యాపారులు ధర్మవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లీలాకుమార్ కర్నూలులోని ఓ హోటల్‌లో బస చేసినట్టు తెలుసుకుని ధర్మవరం పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.