ఖమ్మం
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 5 November 2016
వెంకటాపురం, నవంబర్ 4: మండల పరిధిలోని మర్రికాల పంచాయతీ ఒడగూడెం బెస్తగూడెం గ్రామానికి చెందిన రామెల్ల నరేష్ (30) శుక్రవారం తెల్లవారుజామున ఇంటివద్ద ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నరేష్ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అందరిలాగానే రాత్రి సమయాల్లో భోజనం చేసి ఇంట్లోనే పడుకున్నాడు. అనంతరం ఇంటిముందు ఉన్న పందిరి గుంజకు చున్నీతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులకు భార్య స్వరూప, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై బండారి కుమార్ సంఘటన స్థలం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.