ఖమ్మం

యువత క్రీడారంగంలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17: యువత క్రీడారంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దతండాలో జరిగిన దివంగత పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సంస్మరణ సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. తన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేశారన్నారు. ఆ ప్రజల ఆదరాభిమానాలతోనే తామీస్థాయికి ఎదిగామని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తన సోదరుడు వెంకటరెడ్డికి గ్రామీణ క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉండేదని, తానుకూడా కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలలో పాల్గొని జిల్లా స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. వెంకటరెడ్డి సంస్మరణార్థం పెద్దతండాలో క్రికెట్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. వెంకటరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం దివంగత ఎమ్మెల్యే వెంకటరెడ్డి సంస్మరణార్ధం నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. బాణోతు పాప్యానాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు అయితం సత్యం, చరణ్‌రెడ్డి, సోమ్లా నాయక్, బాలాజీ, వైస్ ఎంపిపి సుజాత, సర్పంచ్ బండి జగదీష్, హరినాధబాబు, బోడా వెంకన్న, కళ్లెం వెంకటరెడ్డి, మద్ది వీరారెడ్డి, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.