ఖమ్మం

టిఆర్‌ఎస్ ప్లీనరీకి తరలిన పల్లెజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, ఏప్రిల్ 26: ఖమ్మంలో జరగనున్న టిఆర్‌ఎస్ పార్టీ 15వ ప్లీనరీ సమావేశం, బహిరంగసభలో పాల్గొనేందుకు ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గం నుండి వందలాదిగా జనం తరలివెళ్ళేందుకు సన్నద్దమయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు అనేక మంది రాష్ట్ర మంత్రులు, అగ్రనాయకులు కార్యక్రమాల్లో పాల్గొననున్నందున వారిని చూసేందుకు ఆసక్తితో రాజకీయాలకు అతీతంగా సైతం అనేక మంది జనం ఖమ్మం తరలివెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, పార్టీ నాయకులు మడత వెంకట్‌గౌడ్, దిండిగాల రాజేందర్, మేకల మల్లిబాబు, లక్కినేని సురేందర్ తదితరులు బుధవారం ఖమ్మంలో జరగనున్న బహిరంగసభకు భారీగా జనాన్ని తరలించే ప్రయత్నాలు చేశారు. పట్టణంతో పాటు గ్రామాలలో సమావేశాలు నిర్వహించి జనసమీకరణ చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం సభకు ఇల్లెందు నియోజకవర్గం నుండి అత్యధికసంఖ్యలో జనం తరలివెళ్ళనున్నారు.