ఖమ్మం

అజాతశత్రువు అటల్‌జీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, ఆగస్టు 17: దేశ మాజీప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్‌పేయి అజాతశత్రువు అని ఎమ్మెల్యే మదన్‌లాల్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎబి వాజ్‌పయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్‌పయి జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. అటువంటి నిరాడంబర వ్యక్తిగత జీవితం నేటి యువతకు, దేశప్రగతి ఎంతో అవసరం అన్నారు. ఆయన ఉత్తమ పార్లమెంటీయన్‌గా కూడా ఎన్నికయిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో నాయకులు మచ్చా వెంకటేశ్వరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఠాగూర్ విద్యాలయంలో నివాళులు...
స్థానిక ఠాగూర్ విద్యాలయంలో కవి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పయికి ఠాగూర్ విద్యాసంస్థల చైర్మన్ సంక్రాంతి సునీత కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రంలో ఉపాధ్యాయులు క్రిష్ణారావు, రామక్రిష్ణ, లింగారావు, క్రిష్ణ, విజయప్రసాద్, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.