ఖమ్మం
చెట్టు పడి వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 May 2016
మణుగూరు, మే 3: సింగరేణిలో ఓవర్బర్డెన్ తొలగించే ప్రైవేట్ కంపెనీ ఎస్విఇసిలో సేవల్ ఆపరేటర్గా పనిచేస్తున్న కంసాని వెంకటేశ్వర్లు (43)పై మంగళవారం సాయంత్రం 7 గంటలకు మామిడి చెట్టు విరిగిపడడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా అయినవల్లికి చెందిన కంసాని వేంకటేశ్వర్లు మణుగూరులో ఎస్విఇసిలో పనిచేస్తున్నాడు. మంగళవారం సా యంత్రం అక్కడి క్యాంటిన్లో టిఫిన్ తిని బయటకు వచ్చేసరికి గాలి వాన ప్రారంభమైంది. ఆ గాలికి అక్కడ ఉన్న మామిడి చెట్టు విరిగి అతని మీద పడడంతో అక్కడికక్కడే మరణించాడు. ఎఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.