ఖమ్మం

ఒక్క ఓటును జారవిడవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 13: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అఖండ మేజార్టితో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు తమ డివిజన్‌లలో పనిచేసి, ఉన్నవాటిలో ఒక్క ఓటును కూడా జారవిడవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం టిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్య పరచాలన్నారు. టిఆర్‌ఎస్ చేసిన అభివృద్దిని తెలుపుతూ గెలుపుకు అశ్ర్తాలుగా వాడుకోవాలన్నారు. డివిజన్లలో బూత్‌ల వారిగా ఓటర్లను నిత్యం కలుస్తూ గత నాలుగేళ్ళుగా ఖమ్మంలో జరిగిన అభివృద్దిని వివరించాలన్నారు. కోట్లాది రూపాయంలో చేసిన అభివృద్ధే పువ్వాడను గెలిపిస్తుందన్నారు. అయితే తమ బాద్యతగా ఓటును అభ్యర్థించాలని సూచించారు. అభ్యర్థి అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్‌ని ప్రతి డివిజన్‌లో ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిశానని వారు టిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకు ప్రతి కార్పొరేటర్ తమ బాథ్యతగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మేయర్ పాపాలాల్, డిప్యూటి మేయర్ బత్తుల మురళీ, పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళ్లీ పాల్గొన్నారు.