ఖమ్మం

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 17: గ్రీవెన్స్‌డేలో అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అయోషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌డేలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఆర్జీలు తీసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. పరిష్కారానికి సంబందించిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. తమ పరిధిలోని వినతులపై సమస్య స్వభావాన్ని అర్జీదారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారమయ్యే వినతులు జిల్లా కేంద్రానికి రాకుండా అధికారులు పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్‌డేలో కార్పొరేషన్ కమిషనర్ జె శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్‌టిఓ శంకర్‌నాయక్, డిఇఓ మదన్‌మోహన్, బిసి సంక్షేమ శాఖ అధికారి హృషికేషిరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.