ఖమ్మం

కూసుమంచిలోనే తుమ్మల మకాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 24: ఇటీవల పాలేరు శాసన సభ్యుడిగా ఎన్నికైన రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇకనుంచి పాలేరు నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలోనే మకాం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం పాలేరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించడంతో పాటు భవిష్యత్తులో కూడా పాలేరు కేంద్రంగానే రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగితే తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి ఖమ్మం జిల్లా నుంచి విడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూసుమంచిని కేంద్రంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఉండి పాలేరు నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించే కంటే కూసుమంచిలో ఉంటేనే బాగుటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా తుమ్మల అనుచరులు కొందరు జీళ్ళచెర్వు గ్రామ సమీపంలో కొంత, కూసుమంచి నుంచి లోక్యాతండా వెళ్ళే రహదారి వెంట కొంత భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక్కడే తుమ్మల ఇంటి నిర్మాణంతో పాటు వ్యవసాయం కూడా చేయనున్నారని తెలుస్తోంది. పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అక్కడే మకాంవేసి ప్రయత్నించాలని తుమ్మల భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.