ఖమ్మం

రైతులకు నిరంతరం విద్యుత్ కోసమే పవర్ ప్లాంటును నిర్మిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, మార్చి 17: తొలి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నిరంతరం 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భద్రాద్రి పవర్ ప్లాంటు అని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. పవర్ ప్లాంటు నిర్మాణంలో తలెత్తిన పర్యావరణ అనుమతుల సమస్య కంటే ఇది ప్రజా సమస్యని చెప్పడం సబబని అన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను జెన్‌కో నిపుణుల కమిటీ ద్వారా నివృత్తి చేయించాలని జెన్‌కో అధికారులకు విజప్తి చేశారు. పీసా చట్టం ద్వారా పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతే భారీ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తుందన్నారు. పవర్ ప్లాంటు పరిధిలో తలెత్తిన ప్రజా సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పవర్‌ప్లాంటులో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారాప్రజలకు తెలిసే విధంగా పీఆర్వోని ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు సీఎండికి విజ్ఞప్తి చేశారు. అలాగే పవర్ ప్లాంటులో స్ధానికులకే ఉద్యోగాలు కల్పించాలని జెన్‌కో అధికారులను కోరారు.