ఖమ్మం

రేవంత్‌రెడ్డి దీక్షకు జిల్లా టిడిపి నేతల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేపట్టిన దీక్షకు ఖమ్మం జిల్లా పార్టీ నేతలు మద్దతు పలికారు. ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జిల్లా నేతలు రేవంత్‌రెడ్డి దీక్షశిబిరానికి వెళ్ళారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నది ఒకటి చేసేది ఒకటిగా ఉందని, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తన స్వార్థం కోసం రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారికి టిడిపి అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపడుతుందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల కోసం రేవంత్‌రెడ్డి చేపట్టిన దీక్షకు రాష్ట్రంలో మద్దతు పెరుగుతుందని, ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ కార్యదర్శి తోటకూరి శివయ్య, తాళ్ళూరి జీవన్, నాగేశ్వరరావు, సింహద్రి, జేమ్స్, గొళ్ళపుడి హరికృష్ణ, పాల్వంచ రాజేష్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యినిర్వహక కార్యదర్శి సరిపుడి గోపిసందేష్ పాల్గొన్నారు.