ఖమ్మం

వేటగాళ్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, జూలై 10: వెంకటాపురం ఫారెస్టు పరిధిలోని ధర్మారం-్భవనపల్లి అటవీ ప్రాంతంలో దుప్పిని వేటాడిన కేసులో అటవీశాఖ అధికారులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో పానెం రమేష్, బొల్లి నాగేశ్వరరావు, సత్యం, తోట లక్ష్మీనారాయణ, మల్లిఖార్జున్‌లను అదుపులోకి తీసుకోగా అల్లి రజనీకాంత్, గారా ఆనంద్, మరికొందరు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ రేంజర్ శంకర్ ఆదివారం సాయంత్రం విలేకర్లకు తెలిపారు. వారి వద్ద నుంచి మాంసం, దుప్పి తలకాయను, తలను స్వాధీనం చేసుకొని వన్యమృగ సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. సోమవారం భద్రాచలం న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు తెలిపారు. సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, బీట్ ఆఫీసర్లు శ్రీను, శివయ్య,లలితకుమారి తదితరులు ఉన్నారు.