ఖమ్మం

ప్రజా సమస్యల పరిష్కారానికి జనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), జూలై 29: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్ శుక్రవారం ఖమ్మంలో జనదీక్షను చేపట్టారు. దీక్షను సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వాలు గాలికొదిలేశాయన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపర్చి హామీనిచ్చినట్లుగా, కెజిటుపిజి ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ వసతీ గృహాల్లో మెరుగైన వసతీ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రజా అవసరాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. లింగాల రవికుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాల్సిన పాలకులు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని కొందరు ప్రజాప్రతినిధులు అవినీతిని ప్రోత్సహిస్తూ రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షను ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణారావు సాయంత్రం విరమింపజేశారు. ఈ కార్యక్రమానికి అనేక ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి.