ఖమ్మం

ఒడ్డుగూడెంలో పంటల ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, ఆగస్టు5: టేకులపల్లి మండలం భారీగా పోలీసు, ఫారెస్టుబలగాలు మోహరించడంతో ఒడ్డుగూడెం వణికిపోయింది. గిరిజన రైతులను గ్రామాల నుండి పోడు భూముల వద్దకు రాకుండా బెదిరించి కేసులు పెడతామని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అన్ని దారులు వెంట పోలీసులు మోహరించడంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. పది ట్రాక్టర్లతో సుమారు యాభై ఎకరాలు మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు. పోలీసుల రక్షణతో రైతులను, ఎన్డీ నాయకులను అడ్డుకున్నారు. ముందస్తుగా పోలీసులు, ఫారెస్టుసిబ్బంది వ్యానుతో వస్తుండగా ఒడ్డుగూడెంలో రైతులు అడ్డుకున్నారు. కొంతసేపు ఘర్షణ పడటంతో చింత భద్రమ్మ, పూనెం భద్రమ్మ, పూనెం కోటమ్మ, జర్పుల విజయ, భూక్యా భిక్షం, చింతా లక్ష్మయ్య, లింగ్యాలను జీపులో ఎక్కించుకొని వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. ఒకవైపు పంటలు ధ్వంసం చేస్తూనే మరోవైపు హరితహారంలో భాగంగా జామాయల్ మొక్కలను సుమారు పది హెక్టార్లలో నాటారు. కొప్పురాయి బీట్‌లో ఒడ్డుగూడెంలోని కంపార్టుమెంటు నెంబరు 30లో 200 హెక్టార్ల భూమి ఉంది. అందులో 125 ఎకరాల భూమిలో హరిత హారం మొక్కలను వేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎఫ్‌ఆర్వో మంజుల ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్లు నరేష్, క్రాంతికుమార్, కృష్ణకుమార్, బోడు ఎస్‌ఐ బొడ్డు అశోక్ ఆధ్వర్యంలో బోడు, టేకులపల్లి, ఆళ్ళపల్లి పోలీసులు రక్షణ కల్పించారు.