ఖమ్మం

అత్యాచారం చేసిన నిందితునిపై నిర్భయ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, సెప్టెంబర్ 9: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో శుక్రవారం నిందితునిపై నిర్భయకేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మద్దులపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన మరో యువకుడు రెండునెలల క్రితం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో అత్యాచారం జరిపాడు. బాలికను ఎవ్వరికైనా చెప్పినట్లయితే హతమారుస్తానని బెదిరించడంతో మిన్నకుండిన బాలిక ఇటీవల ఆమెకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ మేరకు బాలిక తండ్రి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రంజిత్‌కుమార్ నిందితునిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.