ఖమ్మం

ప్రశాంతంగా ఎంసెట్-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 11: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్- 3 పరీక్ష ఆదివారం ఖమ్మం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. ఎంసెట్- 2 లీకేజీతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వైద్య విద్య ఎంట్రన్స్ కోసం ఎంసెట్- 3ని నిర్వహించింది. దీంతో ఆదివారం ఖమ్మం నగరంలో 4 సెంటర్లలో అధికారులు పరీక్షను నిర్వహించారు. మొత్తం 2,172 మంది అభ్యర్థులు ఎంసెట్-3కు దరఖాస్తు చేసుకోగా 1,499 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 673 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. 4 కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులకు ఏలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. రీజనల్ కోఆర్డినేటర్, యూనివర్సిటీ పిజి కళాశాల ప్రిన్సిపాల్ ఎం పుష్పలత పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.