ఖమ్మం

డివిజన్ కోసం ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరుకు రెవెన్యూ డివిజన్ మార్చే వరకు విద్యార్థి ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శరత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కల్లూరుకు రెవెన్యూ డివిజన్ మార్చాలంటూ నినాదాలు చేస్తూ సోమవారం ఎంపిడిఒ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్‌కు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు కల్లూరు అన్ని మండలాలకు కేంద్రంగా ఉన్నందున రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించి, శంకుస్థాపనలు చేసారన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు, కల్లూరుకు రెవెన్యూ డివిజన్ మార్చాలంటూ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో విశ్వనాధం, మోహన్‌కృష్ణ, అనిల్, విజయ్, ఉపేందర్, సాయి, మమత, సుష్మ, పరిమళ తదితరులు పాల్గొన్నారు.