కర్నూల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూలై 25:మండల పరిధిలోని పసుపుల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన నబిరసూల్(30) మృతి చెందినట్లు ఎస్‌ఐ రాకేశ్ తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నబిరసూల్ పసుపుల గ్రామ సమీపంలో అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో నబిరసూల్ తీవ్రంగా గాయపడగా స్థానికులు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.