కర్నూల్

జగన్ రెండవ చక్రాన్ని వదిలితే టిడిపి పతనం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 12:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ‘గడప గడపకూ వైకాపా’ అనే మొదటి చక్రాన్ని వదిలితేనే టిడిపి ప్రభుత్వం అల్లాడిపోతుందని, ఇక రెండవ చక్రాన్ని వదిలితే చంద్రబాబు ప్రభుత్వ పతనం ఖాయమని వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై. రామయ్య పేర్కొన్నారు. నగరంలోని జిల్లా వైకాపా కార్యాలయంలో సోమవారం రామయ్య పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే ప్రజల్లో వ్యతిరేకత రాదని, అయితే ఏపిలో టిడిపి ప్రభుత్వానికి రెండేళ్లలోనే పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. గడప గడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా వైకాపా నాయకు లు ఇంటి ఇంటికీ వెళ్లగా ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేవలం గ్లోబల్ ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనించారని, ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. అలాగే నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ, ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలుచేసి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైకాపా జిల్లా కార్యదర్శి నాగరాజు, తెర్నెకల్ సురేంద్రరెడ్డి, రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.