కర్నూల్

భర్తను చంపిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 25: దొంగతనాలు చేస్తూ రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తను రోకలిబండతో మోది చంపిన భార్య వైనమిది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు స్థానిక వెంకటేశ్వరపురంలోని భగత్‌సింగ్ కాలనీలో మహబూబ్ బాషా (38), భార్య జెనిలా కాపురం ఉంటున్నారు. హతుడు ట్రాన్స్‌ఫార్మర్లు దొంగతనాలు చేస్తూ చిల్లరగా తిరిగేవాడని, ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో అతనిపై కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే ఆగ్రహాన్ని తట్టుకోలేని భార్య, భర్త అయిన మహబూబ్ బాషాపై రోకలిబండతో తలపై బలంగా మోదడంతో బాషా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సోమవారం ఉదయం చూడగా తల నుండి రక్తస్రావం జరిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అయితే భార్య కూడా మద్యం సేవిస్తుందని, ఆ మత్తులోనే భర్తను కొట్టినట్లు మరో వాదన వినిపిస్తోంది. హతుడు అప్పుడప్పుడు బేల్దారి పని చేసేవాడని, ఎక్కువగా దొంగతనాలు చేసేవాడని స్థానికులు తెలిపారు. వీరికి ఇద్దరు మగ సంతానం ఉన్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సిఐ దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి భార్యను, ఇరువురి పిల్లలను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సిఐ తెలిపారు.