తెలంగాణ
టి.జెఎసిని బలోపేతం చేస్తాం:కోదండ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
హైదరాబాద్: ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు టి.జెఎసిని మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కోదండరామ్ బుధవారం ప్రకటించారు. జెఎసి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాల్లో ఎన్నో సమస్యలు ప్రజలను వేధిస్తున్నట్టు తెలిపారు. వర్సిటీల్లో పాలన, ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు, కరవు పరిస్థితులు, భూ నిర్వాసితుల బాధలు, బలవంతపు భూ సేకరణ, సింగరేణి బొగ్గుగనుల్లో ఓపెన్ కాస్టింగ్.. ఇలా అనేక సమస్యలతో తెలంగాణ ప్రజలు సతమతమవుతున్నారని ఆయన వివరించారు. జెఎసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు, సభలు జరిపి జనంలోకి వెళ్తామన్నారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తామని, ఎవరికీ భయపడేది లేదని తెలిపారు.