కృష్ణ

శివయ్యకు లక్ష బిళ్వార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 6: దేశ, రాష్ట్ర, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ శనివారం ఉదయం పాతబస్తీ శ్రీ వసంతమల్లిఖార్జున స్వామివారి దేవస్థానం (బుద్దావారి గుడి)లో కొలువైన పరమేశ్వరునికి దేవస్థానం ఇవో నేల సంధ్య ఆదేశాల మేరకు అర్చకులు నిష్ఠతో లక్ష బిళ్వార్చన నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు శేఖర్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామికి లక్ష బిళ దళాలతో బిళ్వార్చన నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గా ప్రసాద్, తనిఖీ అధికారి ఎ సుజన్, వివిధ దేవస్థానాలకు చెందిన ఇవోలు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

10న వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 6: శ్రీవాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈనెల 10న శ్రీ కృష్ణ ప్రార్థనా మందిరంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, కోశాధికారి గోకవరపు మురళీకృష్ణ, గుడిపాటి పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రార్థనా సంఘంలో 10న ఉదయం 8గంటలకు శ్రీవాసవీ అమ్మవారికి గోక్షీరాభిషేకం, విశేష అలంకారం, శాంతి హోమాలు, కుంకుమపూజలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాల్సిందిగా వారు భక్తకోటికి విజ్ఞప్తి చేశారు.