కృష్ణ

మినుముల దొంగలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు: మినుములు దొంగిలించిన నలుగురు వ్యక్తులను పోలీసులు చాకచక్యంతో పట్టుకుని వారి నుండి రూ.లక్షా 80వేలు విలువ చేసే 37 బస్తాల మినుములను గురువారం స్వాధీనం చేసుకుని విలేఖ్లర్ల ఎదుట దొంగలను హాజరుపర్చారు. ఈ సందర్భంగా బందరు సిఐ నవీన్ నరసింహ మూర్తి మాట్లాడుతూ మచిలీపట్నంకు చెందిన బేతపూడి ప్రశాంత బాబు, కాగిత వెంకటేష్, ఇందుపల్లి ప్రభుకుమార్, పెనుబోతు వెంకటేశ్వరరావులు గూడూరుకు చెందిన బృందావనపు ధన్వంతరి ఆచార్యులు గోడౌన్‌కు చెందిన తాళాలను బదులుగా మారుతాళాలు చేయించి 37 బస్తాలను ఈనెల 20వ తేదీన దొంగిలించారు. యజమాని వెంకటేశ్వరరావు 22వ తేదీన గోడౌన్ తెరిచి చూడగా తనకు ఉన్న బస్తాలు లేకపోవటంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతట సిఐ మూర్తి, ఎస్‌ఐ విల్సన్ బాబులు తన సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో ఉన్న దొంగలను అరెస్టు చేశారు.
ఘనంగా రథోత్సవం
గూడూరు, మార్చి 24: మండల కేంద్రం గూడూరులో వేంచేసియున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలల్లో నూనెపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గురురువారం స్వామివారికి పుష్పయాగం, పవళింపు సేవ కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి గాదె వీరభద్రాచారి పర్యవేక్షించారు.