కృష్ణ

వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సదరన్ డిస్కమ్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా 7 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేయనున్నట్లు డిస్కమ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 25 నుంచి అంతరాయం లేకుండా మూడు గ్రూపుల్లో 7 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయాల్సిందిగా ఆయా జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఎ గ్రూపు వినియోగదారులకు ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు, బి గ్రూపు వినియోగదారులకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, సి గ్రూపు వినియోగదారులకు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు గ్రూపులకు విద్యుత్‌ను సరఫరా చేసే సమయంలో 33 కెవి ఫీడర్ లోడ్ సమంగా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, ప్రతి వారం ఈ గ్రూపులు మారుతుంటాయని ఆ ప్రకటనలో తెలిపారు.