కృష్ణ
అట్టహాసంగా డాంగేకుమారి నామినేషన్ దాఖలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పటమట, మార్చి 22: పటమటలోని 11వ డివిజన్కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత కార్పొరేటర్ వీరంకి డాంగేకుమార్ సతీమణి డాంగేకుమారి బుధవారం ఉదయం పటమట మున్సిపల్ సర్కిల్-3 కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 11వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తూ ఆనారోగ్యంతో డాంగేకుమార్ మృతి చెందటం బాధాకరమన్నారు. ఆయన స్థానంలో వీరంకి డాంగేకుమారి (కృష్ణకుమారి)ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే డాంగేకు మనమిచ్చే ఘనమైన నివాళి అవుతుందన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ 11వ డివిజన్ అభివృద్ధికి డాంగేకుమార్ ఎంతో కృషి చేశారన్నారు. ఇప్పుడు ఆయన సతీమణి కృష్ణకుమారి కార్పొరేటర్గా ఎన్నికైతే డివిజన్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ 11వ డివిజన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతకుముందు ఉదయం వందలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య డాంగేకుమారి నామినేషన్ ర్యాలీ కోలాహలంగా సాగింది. ఈ ర్యాలీ డివిజన్లో పటమట న్యూ ఆర్టీసీ కాలనీ నుండి ప్రారంభమై లక్ష్మీపతి నగర్, జెడినగర్, డొంక రోడ్డు, శివశంకర్ నగర్, ఎన్టీఆర్ వీధి, చిన వంతెన సెంటర్, టవర్లైన్ బజారు, ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్డు మీదుగా పటమట సర్కిల్-3 కార్యాలయానికి చేరింది. ఈ కార్యక్రంమలో తూర్పు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మన్నవ సుబ్బారావు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కె నాగుల్మీరా, పార్టీ నేతలు దేవినేని అవినాష్, కాట్రగడ్డ బాబు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, కార్యకర్తలు పాల్గొన్నారు.