కృష్ణ

మనుమడికి పలక, నేతలకు కత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మే 22: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనను వైఎస్సార్సీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు తీవ్రంగా ఖండించారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెలంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన మనవడి చేతికి బలపం ఇచ్చి టిడిపి రౌడీలకు కత్తులిచ్చారని ఆరోపించారు. 132 జీవోలు జారీ చేసిన టిడిపి నేతలపై కేసులు ఎత్తేశారని విమర్శించారు. నారాయణరెడ్డి హత్య కేసులో చంద్రబాబుతో పాటు డెప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తిని ఏ - 1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపిఎస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకుని పని చేస్తున్నారని, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధిస్తే తప్ప ఏపిలో హత్యాకాండ ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అనివారు ఆరోపించారు. 2014లో జరిగిన కలెకర్ల సమావేశంలో ముఖ్యమంత్రే స్వయంగా కలెకర్లులకు తెదేపా నేతల ఆదేశాలు పాటించాల్సిందేనని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఐపిఎస్, ఐఎఎస్‌తో పాటు పోలీసులపై తెదేపా నేతలు దాడులకు పాల్పడుతుంటే వారిని సిఎం సమర్థించడం దారుణమన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా అపహాస్యం చేస్తున్న విధంగా తెదేపా నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో హత్యా రాజకీయాలన ప్రోత్సహిస్తున్న బాబు ప్రతిపక్ష పార్టీ నేతలను హతమార్చే పనిలో ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని తెదేపా సీనియర్ నేత కరణం బలరామ్ స్వయంగా చెప్పడం తెదేపా హత్యారాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆనాటి వంగవీటి మోహన రంగా నుండి నేటి నారాయరెడ్డి హత్యల వరకు తెదేపా హత్యారాజకీయాలను చేస్తూనే ఉందన్నారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పైలా సోమినాయడు, నాయకులు తోట శ్రీనివాస్, మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు.