క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలోవ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.కొండూరు, ఏప్రిల్ 6: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొత్తూరు భాస్కరరావు (55) ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి గురువారం రాత్రి తన సహచరుడు దాడి నరేంద్ర మోటారుసైకిల్‌పై వస్తున్నాడు. విజయవాడ నుండి తిరువూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మోటారు సైకిల్ వెనుకవైపు కూర్చున్న భాస్కరరావుకు తీవ్ర గాయాలైనాయి. అతనికి తిరువూరు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అతని పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ సంఘటనలో దాడి నరేంద్రకు తీవ్రగాయాలైనాయి. ఇతను తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని గుర్తు తెలియని వాహనం కోసం రెండు పోలీస్ టీంలు గాలిస్తున్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జె.వెంకటరమణ తెలిపారు.