కృష్ణ

నగరానికి చేరుకున్న గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికార శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు స్వాగతం పలికారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించనున్న పోలీస్ సంస్మరణ పెరేడ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌కు మంత్రి రావెల కిషోర్‌బాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు గవర్నర్ వచ్చారు. శుక్రవారం ఉదయం 7.20కు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే పోలీస్ సంస్మరణ పెరేడ్‌లో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నర్‌కు స్వాగతం పలికినవారిలో ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు, లా అండ్ ఆర్డర్ డిజి ఆర్‌పి ఠాకూర్, ఐజి ఆర్‌కె మీనా, విమానాశ్రయం అధికారులు ఉన్నారు.