కృష్ణ

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, అక్టోబర్ 21: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఉదంతమిది. మండల పరిధిలోని చెరువు మాధవరం రైల్వేస్టేషన్ ఎదురుగా రైలు పట్టాలపై వివాహిత మృతదేహం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన బొద్దులూరి శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతుల కుమార్తె నాగమణి (26)ని, ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మల్లాది రవికి ఇచ్చి ఐదేళ్ళ క్రితం పెద్దలు వివాహం జరిపించారు. భర్త రవి విటిపిఎస్ థర్మల్ పవర్ స్టేషనులో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటినుంచి వరకట్నం కోసం అత్తింటివారు నాగమణిని వేధిస్తున్నారు. ఈ విషయాన్ని నాగమణి పలుమార్లు తన తల్లిదండ్రులకు తెలిపింది. కూతురుకు సర్దిచెప్పి కాపురానికి పంపించారు. గురువారం నాడు కూడా కొండపల్లిలోని ఇంట్లో వరకట్నం గురించి గొడవ జరిగింది. ఈ క్రమంలో నాగమణి భర్త రవి, తన భార్యపై చేయి చేసుకున్నాడు. గురువారం సాయంత్రం నాగమణి కనిపించలేదు. ఈవిషయాన్ని భర్త రవి, నాగమణి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియ చేయగా, వారు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. జి.కొండూరు మండలం చెరువుమాధవరం రైల్వేస్టేషను ఎదురుగా రైలు పట్టాలపై గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం రైల్వే సిబ్బంది కనుగొన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని చూసి చనిపోయింది నాగమణేనని ధ్రువీకరించారు. కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్త రవితో పాటు, అత్తింటివారు తమ కూమార్తెను చంపి, ఇలా రైలు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.