కృష్ణ

భర్తను చంపిన కేసులో భార్య, కొడుకు, కోడలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 3: మండలంలోని యాకమూరులో గతనెల 31న భర్తను కొట్టి, కిరోసిన్‌పోసి తగులబెట్టి చంపిన కేసులో భార్య, కొడుకు, కోడలుని గురువారం సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. అనార్యోగ్యానికి గురై సంపాదించటంలేదని శొంఠి ఏడుకొండలు(47)ను చిత్రహింసలు పెట్టి కిరోసిన్‌పోసి, నోటిలో ఏండ్రిన్‌పోసి భార్య వీరకుమారి, కొడుకు వీరబాబు, కోడలు శ్రీదుర్గ నిప్పటించిన విషయం విదితమే. ఏడుకొండలు చికిత్స పొందుతు అదే రోజు మృతిచెందాడు. మృతుని అన్నయ్య శొంఠి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు వీరకుమారి, వీరబాబు, శ్రీదుర్గపై 302,324 సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.