కృష్ణ

ఎవరికీ నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఏప్రిల్ 12: తాము ఏ పార్టీకి, కులానికి వ్యతిరేకం కాదని, కాపు రిజర్వేషన్ ఫలాలు అందేవరకు కాపులు నిద్రపోవద్దని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. స్థానిక క్రాంతి కళాశాలలో అవనిగడ్డ కాపు యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ముద్రగడతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసిలలో ప్రస్తుతం ఉన్న కేటగిరిలో చేర్చమని కాకుండా వారికి నష్టం జరగకుండా అదనపు కేటగిరిలో చేర్చమని మనం చేస్తున్న పోరాటంలో మిగిలిన కులాలను కలుపుకుని వారి మద్దత్తుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ వైకాపా కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరసింహారావు ముద్రగడను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. కార్యక్రమంలో రాట్నాల మాణిక్యాలరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.