కృష్ణ

‘అమరావతి’ దేశానికే తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వ రాజధాని అమరావతి దేశానికే తలమానికం అవుతుందని మైసూరుకు చెందిన అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏమాత్రం అన్యాయం జరుగకుండా, ప్రతి ఒక్కరి ఆమోదంతో రాజధాని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. నూతన రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు పథకాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయని అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీదత్తపీఠంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి జిల్లాలోని అంతర్వేదిని స్వయంగా చూశానని, ఎంతో విలువైన గోదావరి జలాలు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ దిశలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులు అతివృష్టి, అనావృష్టి బారిన పడకుండా వృథాగా పోతున్న నీటిని వినియోగించుకునే విధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు విజయవంతం అవుతాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని, పాడి పంటలు వృద్ధిచెందుతాయని స్వామిజీ వివరించారు. ప్రతి ఒక్కరూ హింసా వాదాన్ని విడనాడి, శాంతియుత జీవనాన్ని సాగించాలని సూచించారు. అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయంలో ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్లను నరకవద్దని, చెట్టు కూడా ప్రాణంతో సమానమని అన్నారు. తమిళనాడులో జల్లికట్టు, తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలను న్యాయస్థానం నిషేధించటం సమంజసమే కాని, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే విధంగా ఎటువంటి ప్రాణహాని, హింస లేకుండా వీటిని కొనసాగించాలని స్వామిజీ సూచించారు. వస్తున్న ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగురు నింపుతుందని చెప్పారు. శ్రీ దత్తపీఠం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.